EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

08/05/2013

నేటి నేతల భారతం



లేలేత మొగ్గలపై ఆఘాయిత్యాలు
నిత్యం పతాక శీర్షికల్లో  తిష్టవేస్తాయి
ప్రెస్ మీట్ లకే పరిమితమవుతూ
ఖండిస్తున్నపేపర్ పులులు

ఆకలి ప్రేగుల ఆర్తనాదాలు వినబడదు
బడుగు జీవుల భాధలు కనబడదు
సభలలో మైకు ముందు మాత్రం
నీతులు వల్లే వేస్తారు.. ప్రశ్నలై పోరాటాలు చేస్తారు..

జనం ఐక్యంగా వుంటే చూడలేరు
కులం పేరుతోనో ,మతం పేరుతో నో
వారి మధ్య సరిహద్దు రేఖలు గీస్తారు
వర్గాలుగా, ప్రాంతాలుగా విడగొట్టి
నిప్పుల కంచెలు వేస్తారు.
అన్నీ ఉత్తిత్తివే
ఆర్బాటాల, ప్రగల్బాల వీరంగం చేసి
చీకటి ఒప్పందాలకు లాలూచీ పడి
మౌనంగా నో కామెంట్ అంటూ వుండిపోతారు

నిఖార్సయిన వాడెవడూ లేడు
దోచుకోవడం ,దాచుకోవడం నేటి విదూరనీతి కదా

నేతిబీరకాయలోని నేతి చందమై
ప్రపంచంలోని పెద్ద ప్రజాస్వామ్యం
ఓటుకు ఇంత సీటుకు ఇంత అని
మార్కెట్లో అమ్ముడవుతున్న దృశ్యం
అయినా ఎవడూ ప్రశ్నించడు
గాంధీ చెప్పిన మూడు కోతుల
సూక్తులు నేర్చుకున్నారేమో
ఇకనైనా మేలుకోవాలి నవ యువ భారతం
లేకుంటే బలవుతోంది భావి భారతం   19.4.13

No comments:

Post a Comment

Comment on Telgu poem