రాజధాని నడిబొడ్డున బుద్ధుడి సాక్షిగా
తెలుగు జాతిపై విసిరిన చాదస్తపు పంజా అది
వైతాళికుల ప్రతిమల్ని నేలకు కొట్టి
ఉద్యమం పేరుతొ ఉన్మాదం ఊరేగిన రోజది
అది ఒట్టి విగ్రహాల ద్వంసం కాదు...నరమేధమే
నాగరికతా సమాజంపై వితండ వాదుల విద్వంసమే ..
మన వేలితో మన కంటినే పొడుచుకొనే
ప్రాంతీయ భావజాలాల సంకుచితత్వం !
జాతికే తలమానికులయిన మన నేతల్ని
మనమే అవమానించుకొనే మూడత్వమే ..
వేరు వేరుగా వుండాలంటే .. సంస్కృతిపై దాడేందుకు ..
సోదరుల భావాలను మనమూ గౌరవిద్దాం ..
అయితే తెలుగు నేలపై తాలిబన్లుగా మారిన కొద్ది మంది
మొత్తం తెలుగుజాతిపై కత్తి కట్టడం అంటే ఉన్మాదమే కదా..
బుద్ధుడి విగ్రహాలు నేలకూల్చిన తాలిబాన్ల రాజ్యం
నేడేక్కడ మట్టిపాలుకాలేదా ?
విద్వంసంతో ఎక్కడా శాంతిని నెలకొల్పలేము
సూర్య చంద్రులకు ప్రాంతీయత అంటుతుందా ..
అలాగే సంఘ సంస్కర్తలకూ అంటదు..
వారిని అవమానిస్తే మనల్ని మనం మరుగుజ్జులం చేసుకోవలసిందే
శ్రీ లంక లో తమిళ్ వాళ్ళకు అన్యాయం జరిగితే
తమిళ నాడు లోని సోదరులు ఒప్పుకోరు ..
మరి మనం ఏమిచేస్తున్నాం
మహానుభావులను ఒక చట్రంలో బందించితే
మన జాతిని ఎదగకుండా ఆపడమే !
ప్రాంతాలు వేరు కావొచ్చు మానవత్వం ఒక్కటే
భావాల్ని ప్రవహింపచేసే భాష ఒక్కటైనప్పుడు
అది మనల్ని కలిపి పేనవేసే ఊపిరిగా చేసుకొందాం
రండి సోదరులారా !
తగిలిన గాయాలకు మమతల పూతలు పూద్దాం !
వాడిన తోటలో స్నేహ సుగంధాలు పూయిద్దాం !!
కరణం లుగేంద్ర పిళ్ళై