నిదురపట్టని రాతిరి
ఆలోచనల సుడిగాలి చుట్టేసి
వ్రాస్తావా.. చస్తావా అంటే ఏంచెప్పను
ఏదో ఒకటి వ్రాసేస్తాను..
నీవేం వ్రాస్తున్నావంటే
ఏం చెప్పను మిత్రమా..
గుండెలో ఉప్పోంగే భావాల లావాలను
అక్షరబద్దం చేస్తున్నానని చెప్పాలనుకుంటే
ప్రతి అక్షరం సమాజ హితం కోరే
బీజమై మొలకెత్తుతోంది
వాడిన జనారణ్యంలో
ఆకుపచ్చని వసంతాలు విరబూస్తోంది
నాకే తెలియని నిబిడాశ్చర్యంతో
అక్షరాలను కళ్ళకు అద్దుకున్నా
భావాలు వ్యక్తపరచలేని
ఎన్నో ఆత్మల ఘోష వినిపిస్తోంది.
పీడిత తాడిత జన సమూహపు
ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి..
అక్షరాల కాళ్ళకు
మొక్కుతుంటే
మరింత సంబ్రమాశ్చర్యం
చీకటి మనోకుటీరాలలోకి
ఆశయ సూర్యుడి ఉదయం కనిపిస్తోంది
వడలిపోయిన శరీరం
కాంతిపుంజమై లేచి నిలబడుతోంది.
నన్ను నేను మదించుకొని
నాలో నేను సిరాగా మారి పోయి
కలం వెంట
అక్షరాలుగా రాలుతుంటే
ఆవిష్కృతమైమయ్యే తృప్తి ముందు
కన్న తల్లి కూడా తక్కువేనని చెప్పనా..
ఈ జనకు ఇంతకంటే సార్థకత లేదని చాటనా... 4.2.13
No comments:
Post a Comment
Comment on Telgu poem