రండి సోదరాలా
అక్షరాలమై
జనిద్దాం
ఆలోచనలమై
చరిద్దాం
తిమిరాలను
కరిగించే
అరుణాకిరణాలమై
ఉదయిద్దాం..
ఎవరు
చెప్పారు
కవిత్వం
వెలుగులు పూయదని
ఎవరన్నారు
పదాలు
పోరుబాటకు ఊపిరవ్వదని
కవిత పాటై
పల్లవించిందా
ప్రతి గుండె
మేలుకొంటుంది
కవిత్వం
పాతపడిందనుకంటే తప్పు
అది మన జీవితాన అక్షరకేతనం
కవిత్వం రాయలంటే
రక్తమే
సిరాగా మారాలి
సలసలా కరిగే
స్పందనవ్వాలి
ఆలోచనల్లోని
అక్షరాలు
అస్త్రాలుగా పుట్టుకు రావాలి
ఏమి
పట్టనట్టు ఉండే లోకాన్ని
చైతన్య
గీతాలై తట్టి లేపాలి..
-కరణం లుగేంద్ర పిళ్ళై
No comments:
Post a Comment
Comment on Telgu poem