EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

15/09/2011

మరుపు కోరల్లో మనిషి

నిన్న జరిగింది ఈ రోజుకి గుర్తుండడం లేదు ..
మనిషి మరబొమ్మ లా మారి పోయాడు
లేక పొతే రాజకీయ నాయకులు
ఇంతటి పాపాలకు ఒడిగట్టే వారుకారేమో!
కనీసం  తనకు ఎవరు చేసిన మేలూ గుర్తుండదు ,
మతిమరుపు రాచకురుపైమనిషిలోని
సున్నితత్వాన్ని చంపెంస్తున్నదేమో?

ఓటు ఎందుకు వేశాడో గుర్తుండదు
ఈ పార్టీ వాడో తానే మర్చి పోయి
అన్ని పార్టీ సభల్లో జెండాగా రెప రెపలాడుతుంటాడు ..
ఎటువంచితే అటువంగి పోయి
ఎటు ఎర వేస్తె చిక్కుకు పోయి
తానూ ఒక పౌరుడనని మర్చి పోయాడు ..
లేక పొతే ఇన్ని దారుణాలు జరుగుతుంటే
నిమ్మకు నీరెత్తినట్టు వుంది పోయేవాడా ?

నిప్పుకు చెదలు పట్టినట్టుంది ..
ఆలోచన మానివేసి నిర్లిప్తుడై యోగిలా మారిపోయాడు
అన్నింటికీ భాద్యత తనది కాదని నిమ్మిత్త మాత్రుడై పోయాడు ..
మాటలు వచ్చినా మౌనమే ఆశ్రహిస్తున్నాడు
ఎవరో ఆడిస్తే అదే తోలుబొమ్మలా మారిపోయాడు
నేతలు చనిపోతే కన్న బిడ్డలు కన్నీరు కార్చకపోయినా
తానూ మాత్రం ఆత్మహత్య చేసుకుంటున్నాడు ..
పరిహారం కోసం ఇంటిల్లిపాది భిక్షగాల్లవుతున్నారు !!

మట్టిని తవ్వి ఖనిజాల్ని మింగేస్తుంటే  పట్టడం లేదు
జల యజ్ఞం పేరుతొ లూటి అవుతుంటే చీమ కుట్టినట్టు లేదు
వారికి కాస్తంత ఊరటగా కిలో రెండు రూపాయల బియ్యం చాలు ...
లేకపోతె గుండె మేఘాల్ని పిండకుండానే కురిసే ఓదార్పు చుక్కలు చాలు

మనిషిని ఆట బొమ్మగా చేసుకొని నాయకులు కోట్లు గడిస్తుంటే
తానూ పంట పండించలేక విరామం కోరుకుంటున్నాడు
ఇది ప్రజాస్వామ్యం అంటే నమ్మి మోసపోయమేమో ?
మనిషి నాయకుల వారసుల కోసం జెండాలు మోస్తున్నాడు ..

మనిషిని మేలుకొంటే చీకటి రాజ్యంలో సూర్యుడవుతాడు
మనిషి తలచుకొంటే తన రాతను తిరిగి వ్రాసుకొనే బ్రహ్మఅవుతాడు ..
అయితే మనమూ ఆలోచనల అలలమై ఓ చేయి అందిస్తాము

                                                    -కరణం లుగేంద్ర పిళ్ళై



No comments:

Post a Comment

Comment on Telgu poem