దమన కాండకు అద్దుహదుపు లేకుండా పోతోంది
అమాయకుల పై బాంబులతో దాడి చేసి
ప్రజలను బయబ్రాంతులను చేస్తే ఏమొస్తుంది ?
ముంబై మార్కెట్లో తెగబడినా రక్త దాహం తీరలేదేమో
ఢిల్లీ హైకోర్ట్ ముందర రాక్షస కాండకు ఒడిగట్టారు ..
ప్రాణం తీయడమంటే వారికో ఆటగా మారిపోయింది
మానవత్వం మంటగలసి
మృగమై సాటి మనిషులనే చంపితే జిహాద్ వస్తుందా
మనుషుల ప్రాణాలు తీయమని ఏ మతం చెప్పదు..
ఉగ్రవాదం , ఉన్మాదమై ఊరేగుతుంటే చూస్తూ వుండాలా ?
నేరం నిరూపణ అయిన సంవత్సరాల తరబడి
కోట్లు ఖర్చు పెట్టి వారిని కాపాడే ప్రభుత్వమా మేలుకో
కావలసింది సానుభూతులు , పరామర్శలు కాదు
బతకడానికి ధైర్య మనే నమ్మకం ..
దౌత్య నీతికొసం దానవులను మన్నిచకండి
ఉగ్రవాదపు ఉసురు తీసి శాంతికి పట్టాభిషేకం చేయండి !!
కరణం లుగేంద్ర పిళ్ళై
No comments:
Post a Comment
Comment on Telgu poem