EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

07/09/2011

ఉగ్రవాదం ఉసురు తీయాలి !!

దమన కాండకు అద్దుహదుపు లేకుండా పోతోంది 
అమాయకుల పై బాంబులతో దాడి చేసి  
ప్రజలను బయబ్రాంతులను చేస్తే ఏమొస్తుంది ?
ముంబై మార్కెట్లో తెగబడినా రక్త దాహం తీరలేదేమో 
ఢిల్లీ హైకోర్ట్ ముందర రాక్షస కాండకు ఒడిగట్టారు ..
ప్రాణం తీయడమంటే వారికో ఆటగా మారిపోయింది 
మానవత్వం మంటగలసి 
మృగమై సాటి మనిషులనే చంపితే జిహాద్ వస్తుందా 
మనుషుల ప్రాణాలు తీయమని ఏ మతం చెప్పదు..
ఉగ్రవాదం , ఉన్మాదమై ఊరేగుతుంటే చూస్తూ వుండాలా ?
నేరం నిరూపణ అయిన సంవత్సరాల తరబడి 
కోట్లు ఖర్చు పెట్టి వారిని కాపాడే ప్రభుత్వమా మేలుకో 
కావలసింది సానుభూతులు , పరామర్శలు కాదు 
బతకడానికి ధైర్య మనే నమ్మకం ..
దౌత్య నీతికొసం దానవులను మన్నిచకండి
 ఉగ్రవాదపు ఉసురు తీసి శాంతికి పట్టాభిషేకం చేయండి !!
                                                                               కరణం లుగేంద్ర పిళ్ళై



No comments:

Post a Comment

Comment on Telgu poem