చాకలి మాటలకే
రాముడు తల్లడిల్లాడు
సీత అగ్నిపునీతురాలైంది ..
అది ఆనాటి రామాయణం ..!
నేడు ఎవరు ఏమన్నా
ఎన్ని ఆరోపణలు చేసినా
ప్రత్యారోపణ చేయడం
ఇతరుల్లో తప్పులు వెతకడం
నేటి రామాయణం !
మాటల్లో అందరూ రామరాజ్యం అంటారు
విలువలు లేని రాజ్యం ఎందుకు
తముల్నే చంపి శోకం విలువ తెలిసి అశోకుడు
శాంతికి చిహ్నంగా మారాడు
ధర్మ పాలన చేసాడు ..
చేతకు మాటకు పొంతన ఉండబట్టే
గాంధీ మహాత్ముడు అయ్యాడు ..
సిధార్డుడు బుద్ధుడుగా అవతరించాడు
అన్నా హాజారే జాతిని మేలుకోల్పగాలిగాడు
నేతల్లలారా సొల్లు కబుర్లు మాని
మీరు మారండి ..మీ పార్టీని ప్రక్షాళన చేయండి
మీరు వేషాలు మానిన నాడే
మాకు అంతో ఇంతో మేలు చేసినట్టు
మీరు డ్రామాలు ఆపిన రోజే
మాలో మాకు ఇక్యమత్యం పెంచినట్టు ..
- కరణం లుగేంద్ర పిళ్ళై
No comments:
Post a Comment
Comment on Telgu poem